మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం.. మధ్యాహ్నం 1గం. నుండి 5గం .ల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
15 నుంచి ఒంటిపూట బడులు
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాస్ లు
ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వ హించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్ మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.
టైం టేబుల్ 8am-12:30pm
8am 1st bell
8:05 2nd bell
8:15-8:55 1st period
8:55-9:35 2nd period
9:35-10:15 3rd period
10:15-10:30 Break
10:30-11:10 4th Period
11:10-11:50. 5th period
11:50-12:30 6th period